ETV Bharat / city

మహిళ ఆత్మహత్యాయత్నం.. వైకాపా పాలనపై నారా లోకేశ్ ఆగ్రహం

author img

By

Published : Nov 25, 2020, 8:03 PM IST

nara-lokesh-critisizing-ycp-government-about-woman-suicide-attempt-in-satuluru
మహిళ ఆత్మహత్యాయత్నం.. వైకాపా పాలనపై నారా లోకేశ్ ఆగ్రహం

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరులో మహిళ ఆత్మహత్యాయత్నంపై.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఈ ఘటనకు కారణమైన వైకాపా నేతని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ మహిళలకు ఇచ్చే అభయం ఇదేనా అంటూ ట్విట్టర్​లో ప్రశ్నించారు.

ఓ ఒంటరి మహిళకి జీవనాధారమైన హోటల్​ని.. వైకాపా నాయకుడు కబ్జా చేసేందుకు బెదిరింపులకు దిగడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. ఏపీలోని గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన మాలతి.. పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించడంపై లోకేష్​ స్పందించారు. మహిళలకు సీఎం జగన్ ఇచ్చే అభయం ఇదేనా అని ప్రశ్నించారు.

nara-lokesh-critisizing-ycp-government-about-woman-suicide-attempt-in-satuluru
మహిళ ఆత్మహత్యాయత్నం.. వైకాపా పాలనపై నారా లోకేశ్ ఆగ్రహం

పిల్లలతో కలిసి మాలతి ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమైందంటే.. వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతుందని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఆమెను వేధించిన వైకాపా నేతని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. వైకాపా పాలనలో సామాన్యులకు రక్షణ లేదని.. ఆంధ్రప్రదేశ్​ని ఆత్మహత్యల ప్రదేశ్​గా జగన్ మార్చేశారని లోకేశ్ ఆరోపించారు. వేధింపులకు గురిచేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కల్పిస్తున్నారని దుయ్యబట్టారు. ఆ పార్టీ నేతల అరాచకాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలికి సంబంధించిన వీడియోను.. లోకేశ్‌ ట్విట్టర్​కు జత చేశారు.

ఇదీ చదవండి: 'మా నినాదం విశ్వనగరం.. ప్రతిపక్షాల నినాదం విద్వేష నగరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.