ETV Bharat / city

అందుకే.. రైతు భరోసా పాదయాత్ర.. రేవంత్​రెడ్డి ట్వీట్​

author img

By

Published : Feb 8, 2021, 5:36 AM IST

Updated : Feb 8, 2021, 10:09 AM IST

revanth
అందుకే.. రైతు భరోసా పాదయాత్ర.. రేవంత్​రెడ్డి ట్వీట్​

రైతుల కష్టం, దుఃఖం, బాధే.. రైతు భరోసా పాదయాత్ర చేసేందుకు తనను ప్రేరేపించాయని రేవంత్​రెడ్డి అన్నారు. నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేటలో చేపట్టిన రాజీవ్​ రైతు భరోసా దీక్షను .. భరోసా పాదయాత్రగా మారుస్తున్నట్లు ప్రకటించారు. అక్కడ నుంచే పాదయాత్రగా హైదరాబాద్ వైపు​ పయనమయ్యారు.

రాజీవ్‌ రైతు భరోసా పాదయాత్ర నిర్ణయం వెనుక రైతుల కష్టం, దుఃఖం, బాధే తనలో ఆవేదనను రగిలించాయని కాంగ్రెస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి తెలిపారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నాగర్​కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్‌ చేపట్టిన రాజీవ్‌ రైతు భరోసా దీక్షలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి...అక్కడే అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

రైతు భరోసా దీక్షను.. రైతు భరోసా పాదయాత్రగా మారుస్తున్నట్లు తెలిపారు. అనంతరం అక్కడ నుంచే హైదరాబాద్​కు పాదయాత్రగా బయలుదేరారు. రాత్రికి ఉప్పునుంతలకు చేరుకొని అక్కడే బసచేశారు.

ఇవాళ ఉదయం పది గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. రోజుకు పది కిలోమీటర్ల చొప్పున దాదాపు పది రోజుల పాదయాత్ర సాగుతుందని పేర్కొన్నారు. సరూర్​నగర్​ బహిరంగ సభతో పాదయాత్ర ముగుస్తుందని తెలిపాయి.

రాజీవ్​ రైతు భరోసా పాదయాత్ర ఎందుకు చేయాల్సి వచ్చిందో ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

రాజీవ్​ రైతు భరోసా యాత్ర నిర్ణయం వెనుక రైతు కష్టం, దుఃఖం, బాధ కలిసి నాలో రగిలిన ఆవేదన ఉంది. రైతుల పక్షాన రైతుల కాంగ్రెస్ కొట్లాటలో ఇదే తొలి 'అడుగు'.

- రేవంత్​ రెడ్డి ట్వీట్​

ఇవీచూడండి: రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం.. హైదరాబాద్​కు పాదయాత్ర

Last Updated :Feb 8, 2021, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.