ETV Bharat / city

Peddireddy on 3 capitals repeal bill: 'చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్‌ మాత్రమే'

author img

By

Published : Nov 22, 2021, 2:06 PM IST

Updated : Nov 22, 2021, 2:16 PM IST

Peddireddy on 3 capitals repeal bill
మంత్రి పెద్దిరెడ్డి

ఏపీ 3 రాజధానుల చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్​ మాత్రమే అని మంత్రి పెద్దిరెడ్డి(Peddireddy on 3 capitals repeal bill) వ్యాఖ్యానించారు. తాను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నానని చెప్పారు.

ఏపీ మూడు రాజధానుల చట్టం ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి(minister peddireddy on ap 3 capitals law withdraw) స్పందించారు. చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్‌ మాత్రమే.. శుభం కార్డుకు మరింత సమయం ఉందని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశామని.. చట్టం ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ(AP ministers on repeals of ap 3 capitals act) కాదన్నారు.

కేబినెట్​ సమావేశం ముగిసిన తర్వాత సీఎం జగన్​.. అసెంబ్లీలో ప్రకటిస్తామన్నారు. సీఎం జగన్​ ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. సాంకేతిక సమస్యలు, లీగల్​ సమస్యలను సరిదిద్దడానికి ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. ఇప్పటికి ఇంటర్వెల్​ మాత్రమే పూర్తయింది. జగన్​ పాదయాత్ర లాగా.. ఇది లక్షల మందితో కొనసాగలేదు. నా మద్దతు మాత్రం మూడు రాజధానులకే. -పెద్ది రెడ్డి, ఏపీ మంత్రి

తాను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నానని మంత్రి ఉద్ఘాటించారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా రాయలచెరువులో మీడియాతో మంత్రి మాట్లాడారు. అమరావతి రైతుల పాదయాత్ర.. పెయిడ్‌ ఆర్టిస్టుల పాదయాత్రగా అభివర్ణించిన మంత్రి పెద్దిరెడ్డి(minister peddireddy latest news on amaravathi padayatra).. రైతుల పాదయాత్ర లక్షలమందితో సాగుతోందా అని ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల ఉపసంహరణ విషయం నాకు తెలియదని.. అలాంటిది ఏదైనా ఉంటే సీఎం జగన్ అసెంబ్లీలో ప్రవేశపెడతారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఒంగోలులో పేర్కొన్నారు.

మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం కొన్ని గంటల క్రితం ప్రకటించింది. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని వెల్లడించింది. చట్టం ఉపసంహరణపై ఏపీ హైకోర్టుకు అడ్వొకేట్​ జనరల్..​ వివరాలతో సహా నివేదిక సమర్పించారు. రాష్ట్రానికి ఒకే రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ గత కొన్ని రోజులుగా రైతులు, మహిళలు మహాపాదయాత్ర చేపట్టారు.

చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్‌ మాత్రమే: మంత్రి పెద్దిరెడ్డి

ఇదీ చదవండి: KTR on BJP leaders: 'దేశభక్తిపై ధ్రువీకరణ పత్రాలిచ్చేందుకు ఈ మూర్ఖులెవరు.?'

Kishan reddy on kcr: 'సమస్యే కానీ అంశాన్ని సమస్యగా మార్చారు'

Last Updated :Nov 22, 2021, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.