ETV Bharat / city

అనుమానాల్లేవ్..త్వరలోనే మూడు రాజధానులు: ఏపీ మంత్రి బొత్స

author img

By

Published : Feb 25, 2021, 10:51 PM IST

అనుమానాల్లేవ్..త్వరలోనే మూడు రాజధానులు: ఏపీ మంత్రి బొత్స
అనుమానాల్లేవ్..త్వరలోనే మూడు రాజధానులు: ఏపీ మంత్రి బొత్స

మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ అంశంపై న్యాయపరమైన సమస్యలు ఉన్నాయని.. న్యాయ వివాదం పరిష్కారం కాగానే ఏ నిమిషంలోనైనా సరే విశాఖలో కార్యనిర్వహణ రాజధాని ఏర్పాటు చేస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అమరావతిలో భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తామన్నారు.

త్వరలోనే మూడు రాజధానుల ఏర్పాటు జరుగుతుందని.. ఎవరూ అనుమానపడాల్సిన అవసరం లేదని ఏపీ మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఈ అంశంపై న్యాయపరమైన సమస్యలు ఉన్నాయని.. వివాదం పరిష్కారం కాగానే విశాఖలో కార్యనిర్వహణ రాజధాని ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతిలో భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తామన్నారు.

అమరావతి అభివృద్దిపై సీఎం జగన్​కు చిత్తశుద్ధి ఉందన్నారు. అమరావతిలో అవసరమైన మేరకు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నామన్నారు. దీనికోసం రూ.3 వేల కోట్లు బ్యాంకుల నుంచి అప్పుతెచ్చి అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు.

అనుమానాల్లేవ్..త్వరలోనే మూడు రాజధానులు: ఏపీ మంత్రి బొత్స

ఇదీ చదవండి: 'నిజంగా లక్ష ఉద్యోగాలిస్తే మెడలో బోర్డు వేసుకుని తిరిగెటోళ్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.