ETV Bharat / city

Maoist Surrender: మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలి లొంగుబాటు

author img

By

Published : Oct 16, 2021, 4:41 PM IST

Maoist
మావోయిస్టు

ఏపీ విశాఖ పోలీసుల ఎదుట సీపీఐ మావోయిస్టు పెదబయలు ఏరియా కమిటీ సభ్యురాలు కొర్రాకుమారి లొంగిపోయారు. 46 చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాలుపంచుచుకున్నారని పోలీసులు తెలిపారు.

సీపీఐ మావోయిస్టు పెదబయలు ఏరియా కమిటీ సభ్యురాలు కొర్రాకుమారి ఏపీ విశాఖ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమెపై 4 లక్షల రూపాయల రివార్డు ఉంది. 6 హత్యలు, 5 ఎదురు కాల్పులతో పాటు 46 చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారని విశాఖ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. ఈ ఘటనల్లో కొర్రాకుమారి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిగత కారణాలు, వివక్ష, ఎన్ కౌంటర్లలో సహచరులను కోల్పోవడం వంటి కారణాలతో లొంగిపోయినట్లు కుమారి అలియాస్ శ్వేత తెలిపారు.

కొర్రకుమారి అలియాస్​ శ్వేత.. దాదాపు 12 ఏళ్లు ఈమె మావోయిస్టు పార్టీలో ఉన్నారు. ఈమె.. 6 హత్యలు, 5 ఎదురు కాల్పులతో పాటు 46 చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. ఆమెపై 4 లక్షల రూపాయల రివార్డు ఉంది. మావోయిస్టు పార్టీలో వివక్ష, తదితర కారణాల వల్ల లొంగిపోయారు. ఈమెకు ప్రభుత్వం నుంచి రావల్సిన లబ్దిని అందేలా చూస్తాం.

-బి.కృష్ణారావు, విశాఖ జిల్లా ఎస్పీ

మావోయిస్టు పెదబయలు ఏరియా కమిటీ సభ్యురాలు కొర్రాకుమారి లొంగుబాటు

ఇవీ చూడండి: daughter-in-law killed her uncle:ఆ పనికి అడ్డువస్తున్నాడని మామను చంపిన కోడలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.