ETV Bharat / city

కేసీఆర్​పై సీబీఐకి కేఏ పాల్​ ఫిర్యాదు.. భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ..

author img

By

Published : Jun 22, 2022, 7:09 PM IST

KA Paul Complaint on KCR: సీఎం కేసీఆర్​పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​.. సీబీఐకి ఫిర్యాదు చేశారు. కేసీఆర్​తో పాటు కేటీఆర్​, హరీశ్​రావు, సంతోష్​, కవితపై కూడా ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం, యాదాద్రి ప్రాజెక్టుల్లో భారీగా అవినీతికి పాల్పడ్డారని అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు పాల్​ తెలిపారు.

KA Paul Complaint to CBI on CM KCR and his family about Kaleshwaram Corruption
KA Paul Complaint to CBI on CM KCR and his family about Kaleshwaram Corruption

KA Paul Complaint on KCR: ముఖ్యమంత్రి కేసీఆర్​, మంత్రులు కేటీఆర్​, హరీశ్‌రావులపై... సీబీఐకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవకతవకలకు పాల్పడ్డారని.. యాదాద్రి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దిల్లీలోని సీబీఐ కార్యాలయంలో ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లు కేఏ పాల్‌ తెలిపారు.

"సీబీఐ అధికారులకు తెలంగాణ సీఎం కేసీఆర్​తో పాటు కేటీఆర్​, హరీశ్​రావు, కవిత, సంతోష్​పై ఫిర్యాదు చేశాం. రాష్ట్రంలో చాలా పెద్ద ప్రాజెక్టయిన కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కంప్లైంట్​ చేశాం. లక్షా ఐదు వేల కోట్ల ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగినట్టు వివరించాం. యాదాద్రి ప్రాజెక్టులోనూ అవకతవకలు జరిగినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టుల్లో వీళ్ల అవినీతి గురించి.. సుదీర్ఘంగా అధికారులకు వివరించాం. వాళ్లు కూడా ఓపికతో ఆలకించారు. ఏవిధంగా విచారణ చేస్తారో అధికారులు వివరించారు. ఇందులో భాగంగా వాళ్లకు ఎలాంటి సహకారం కావాలన్న నావంతు సహకరిస్తానని తెలిపాను. ఈ విచారణ చాలా ప్రమాదకరమైనది కాబట్టి.. అధికారులకు ఎలాంటి కీడు జరగకూడదని ప్రార్థన కూడా చేశాం." - కేఏ పాల్​, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు

కేసీఆర్​పై సీబీఐకి కేఏ పాల్​ ఫిర్యాదు.. భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ..

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.