ETV Bharat / city

కొహెడ మార్కెట్​ను సందర్శించిన ఎమ్మెల్యే కిషన్​ రెడ్డి

author img

By

Published : Apr 30, 2020, 11:05 PM IST

తుర్కయంజాల్​ మున్సిపాలిటీ పరిధిలోని కొహెడలో కొత్తగా ఏర్పాటు చేసిన పంట్ల మార్కెట్​ను స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి సందర్శించారు.

IbrahimPatnam Mla visits Koheda fruit market
కొహెడ మార్కెట్​ను సందర్శించిన ఎమ్మెల్యే కిషన్​ రెడ్డి

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కొహెడ పండ్ల మార్కెట్​ను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి సందర్శించారు. మార్కెట్లో కూలీలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఇంత పెద్ద మార్కెట్ ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. లాక్​డౌన్​ తర్వాత మార్కెట్ వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయని అన్నారు.

బిజెపి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి సైతం మార్కెట్​ను సందర్శించారు. దక్షిణ భారతదేశంలోనే పెద్ద మార్కెట్ అయినా గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్​ను కొహెడకు తరలించడం ఈ ప్రాంతానికి మంచి పరిణామం అన్నారు. కరోనా నేపథ్యంలో కనీస మౌలిక వసతులు కల్పించి రైతులు, వ్యాపారులు, ఏజెంట్లు ఇబ్బంది పడకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇవీ చూడండి: 'ప్రవేశ పరీక్షల దరఖాస్తు స్వీకరణ గడువు పెంపు'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.