ETV Bharat / city

అచ్యుతాపురం ఘటనపై హైపవర్​ కమిటీ.. ప్రమాద కారణాలపై ఆరా..

author img

By

Published : Aug 4, 2022, 7:04 PM IST

high-level-committee-on-atchutapuram-incident-in-anakapalli-district
high-level-committee-on-atchutapuram-incident-in-anakapalli-district

High Level Committee on Atchutapuram incident: ఏపీలోని అచ్యుతాపురం గ్యాస్​ లీక్​పై ప్రభుత్వం నియమించిన హైపవర్​ కమిటీ ఘటనా స్థలంలో విచారణ చేపట్టింది. ప్రమాదానికి గల కారణాలపై కమిటీ సభ్యులు ఆరా తీస్తున్నారు. వివరాలు సేకరిస్తున్నారు.

High Level Committee on Atchutapuram incident: ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం బ్రాండిక్స్ పరిధిలో ఉన్న సీడ్స్ కంపెనీలో ఇటీవల రెండోసారి గ్యాస్ లీక్ అయిన సంఘటనపై దర్యాప్తు చేసేందుకు... రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హై పవర్ కమిటీ ఈరోజు తనిఖీ నిర్వహించింది. ఇక్కడ దుస్తుల తయారీ పరిశ్రమలో గ్యాస్ లీక్ కారణాలపై విచారణ చేపట్టింది. రెండోసారి గ్యాస్ లీక్ అయిన సంఘటనలో 121 మంది మహిళా కార్మికుల అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. రెండు నెలల వ్యవధిలో సీడ్స్​లో రెండుసార్లు గ్యాస్ లీక్ అవ్వడం, మహిళలు అస్వస్థత గురికావడంపై ప్రభుత్వం సీరియస్​గా తీసుకుంది. విచారణకు కమిటీ నియమించింది. వీరు పరిశ్రమ లోపల విచారణ చేపట్టారు. ప్రమాదాలకు కారణాలపై విచారిస్తున్నారు.

ఇదీ జరిగింది: అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్‌ కంపెనీలో గ్యాస్‌ లీక్‌ ఘటనలో బాధితులకు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో 53 మంది మహిళలు చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది జూన్‌ 3న ఇదే కంపెనీలో విషవాయువు లీకై 469 మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం అదే తరహాలో గాఢమైన విషవాయువు లీక్ కావడంతో.. బీ-షిఫ్టులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వాంతులు, తల తిరగడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. భోజన విరామ సమయంలో వాయువు వెలువడిందని.. కొన్ని నిమిషాల్లోనే వ్యాపించి ఏం జరిగిందో తెలుసుకునే లోపే కుప్పకూలిపోయినట్టు బాధితులు చెబుతున్నారు.

ఉన్నతస్థాయి కమిటీ: అచ్యుతాపురం సెజ్‌లో విషవాయువు లీక్‌ ఘటనపై ముఖ్యమంత్రి జగగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై సీఎం ఆరా తీశారు. విషవాయువు లీక్‌ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు గల కారణాలను వెలికితీయాలన్నారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపైనా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌ జరిపించాలని అధికారులను ఆదేశించారు.

ఎన్జీటీ కమిటీ: సీడ్స్‌ కంపెనీలో విషవాయువు లీకేజీపై విచారణకు.. ఆరుగురు సభ్యులతో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ కమిటీ నియమించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ డైరెక్టర్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. నోడల్‌ ఎజన్సీగా కాలుష్య నియంత్రణ మండలి ఉంటుందని తెలిపింది. 2 వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని.. చర్యలపై తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విషవాయువు వార్తను సుమోటోగా స్వీకరించిన ఎన్జీటీ ప్రిన్సిపల్ బెంచ్‌.. తదుపరి విచారణను డిసెంబర్‌ 16కు వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.