ETV Bharat / city

'చెన్నమనేని పౌరసత్వ పిటిషన్​ బెంచ్​ ముందుంచండి'

author img

By

Published : Feb 4, 2021, 3:57 PM IST

Updated : Feb 4, 2021, 7:47 PM IST

vemulawada mla chennamaneni citizenship
vemulawada mla chennamaneni citizenship

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​పై హైకోర్టులో కేంద్ర హోంశాఖ దాఖలు చేసిన అఫిడవిట్​పై విచారణ జరిగింది. వీలైనంత త్వరగా పిటిషన్​ను బెంచ్​ ముందుంచాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్​కు​ ఇప్పటికీ జర్మని పౌరసత్వం ఉందని పునరుద్ఘాటిస్తూ కేంద్ర హోంశాఖ హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. చెన్నమనేని పౌరసత్వం వివాదంపై వ్యాజ్యం... హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం వద్ద విచారణకు వచ్చింది. రోస్టర్ మారినందున సంబంధిత బెంచ్ విచారణ జరుపుతుందని జస్టిస్ చల్లా కోదండరాం తెలిపారు.

ఇప్పటికే పాక్షికంగా వాదనలు విన్నందున విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వాలని ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది రవికిరణ్ కోరగా.. న్యాయమూర్తి నిరాకరించారు. జర్మని పౌరుడు పదేళ్లు చట్టసభలో కొనసాగడం తీవ్రంగా పరిగణించదగిన అంశమని... పిటిషన్​ను త్వరగా తేల్చాలని కోరారు. స్పందించిన ధర్మాసనం... వీలైనంత త్వరగా సంబంధింత బెంచ్ ఎదుట ఉంచాలని రిజస్ట్రీని ఆదేశించింది.

గత కొంత కాలంగా...

చెన్నమనేని రమేశ్‌ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ గతంలో ఆది శ్రీనివాస్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఏడాది క్రితం చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్రహోంశాఖ ప్రకటించింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

చెన్నమనేని జర్మనీ పౌరసత్వం ఇప్పటికీ కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ హైకోర్టుకు నివేదించింది. జర్మనీ పౌరసత్వాన్ని 2023 వరకు పొడిగించుకున్నారని వివరించింది. ఆయన పౌరసత్వం వివరాలను కేంద్ర హోంశాఖ మెమో రూపంలో సమర్పించడాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం... పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేసు విచారణ కొనసాగుతోంది.

ఇదీ చూడండి: దా'రుణ'యాప్​లను తొలగించండి.. డీజీపీకి హైకోర్టు ఆదేశం

Last Updated :Feb 4, 2021, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.