ETV Bharat / city

రాష్ట్రంలో భానుడి ప్రతాపం... గరిష్ఠ ఉష్ట్రోగ్రత ఎక్కడంటే..!

author img

By

Published : Apr 13, 2022, 7:00 PM IST

temparature
temparature

Telangana Temperature: మండుతున్న ఎండలు.. ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. వడగాల్పులతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. పగటిపూటే కాదు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అసాధారణంగా పెరుగుతున్నాయి.

Telangana Temperature: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు భగ్గుమంటున్నాడు. బయట అడుగు వేస్తే నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టు అనిపిస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లా జైనద్​లో అత్యధికంగా 43.0 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్​ జిల్లా బోరాజ్​లో 42.6 డిగ్రీలు, ఆదిలాబాద్​ అర్బన్​​ 42.3, నిర్మల్​ నర్సాపూర్​లో 41.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

temparature
రాష్ట్రంలో ఉష్ణోగ్రత వివరాలు

ఉదయం 11 గంటల నుంచే రోడ్లన్నీ ఎండ తీవ్రతకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసర పనులకు తప్పితే జనాలు బయటకు రావడం లేదు. ఎండ తీవ్రతకు జనాలు అల్లాడుతున్నారు. బయటకు వచ్చిన వ్యక్తులు ఎండ వేడిమిని తట్టుకోలేక కొబ్బరి బొండాలు, జ్యూస్​లు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు.

ఇదీ చదవండి : 'ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ బూస్టర్ డోస్‌కు అనుమతివ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.