ETV Bharat / city

Vivekananda Murder: వివేకా హత్యకేసులో.. ఐదో రోజు సీబీఐ విచారణ

author img

By

Published : Jun 11, 2021, 12:09 PM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హ‌త్య కేసులో ఐదవ రోజు సీబీఐ విచార‌ణ కొన‌సాగుతోంది. ఏపీలోని కడప కేంద్ర కారాగారంలో గల అతిథి గృహంలో సీబీఐ రవాణా శాఖ అధికారులను విచారిస్తోంది. వివేకా హత్య సమయంలో అనుమానాస్పద వాహనాలపై ఆరా తీస్తున్నారు.

వివేకా హత్యకేసులో ఐదోరోజు సీబీఐ విచారణ
వివేకా హత్యకేసులో ఐదోరోజు సీబీఐ విచారణ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఐదవ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఏపీలోని కడప కేంద్ర కారాగారంలో గల అతిథి గృహంలో సీబీఐ అధికారులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్య సమయంలో సంచరించిన వాహనాలపై రవాణా శాఖ అధికారులనుంచి ఆరా తీస్తున్నారు.

సీబీఐ విచారణకు వైకాపా కార్యకర్త కిరణ్‌కుమార్‌ యాదవ్‌ వరుసగా మూడో రోజు హాజరయ్యారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని ఐదోరోజు సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. హత్య రోజు జరిగిన పరిణామాలు తేల్చే దిశగా దర్యాప్తు సాగుతోంది.

ఇదీ చదవండి: MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.