ETV Bharat / city

టాప్ టెన్ న్యూస్ @3PM

author img

By

Published : Nov 4, 2020, 2:58 PM IST

ETV BHARAT TOP TEN NEWS
టాప్ టెన్ న్యూస్ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

1. భారతీయ అమెరికన్ల హవా

అమెరికా ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థులు మరోసారి తమ హవా కొనసాగించారు. గత ఫలితాలను పునరావృతం చేస్తూ.. నలుగురు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. సుప్రీంకు వెళ్తాం

అమెరికా ఎన్నికల్లో భారీ మోసం జరగనుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. తనకు సంబంధించినంత వరకు ఇప్పటికే గెలిచామని ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. పుంజుకున్న ట్రంప్!

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో అంచనాలను తలకిందులు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ దూసుకెళుతున్నారు. అనేక పెద్ద రాష్ట్రాల్లో విజయం సాధించిన ఆయన.. ఎలక్టోరల్​ ఓట్లలో మొదటి నుంచి ముందంజలో ఉన్న బైడెన్​ను ఓ దశలో దాటేశారు. లెక్కింపు కొనసాగుతోన్న మిగిలిన రాష్ట్రాల్లోనూ ఆధిక్యంలో ఉన్న ట్రంప్.. ఇలాగే కొనసాగితే గెలుపు తథ్యమే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. సొమ్ము చెలిస్తాం

అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు అనుమతివ్వాలని ఏపీ ప్రభుత్వం... తెలంగాణ హైకోర్టును మరోసారి కోరింది. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన కేసులపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ శ్రీరాం న్యాయస్థానాన్ని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. గెలుపుపై పార్టీల ధీమా

దుబ్బాక ఉప ఎన్నికలో ఓటరు చైతన్యం ప్రస్పుటమైంది. సుమారు 83 శాతం పోలింగ్ నమోదైంది. ఓటెత్తిన దుబ్బాక తమకే లాభిస్తుందని ప్రధాన పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. ఎవరికి వారు తాము ఇంత మోజార్టీతో గెలుస్తాం.. అంత మోజార్టీతో గెలుస్తాం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి... ప్రభుత్వమై కొనుగోలు చేసి... రైతులను ఆదుకున్న కేసీఆర్​దేనని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీ, సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. దిల్లీలో సీఎం నిరసన

పంజాబ్​ పట్ల కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఆ రాష్ట్ర సీఎంతో సహా ఎమ్మెల్యేలు.. దిల్లీలోని జంతర్​మంతర్​ వద్ద ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో విద్యుత్​ సంక్షోభం నెలకొందని, ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. గోదాములో భారీ పేలుడు

గుజరాత్​ అహ్మదాబాద్​లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు క్షతగాత్రులయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. శామ్యూల్స్ రిటైర్మెంట్

కరీబియన్ క్రికెటర్ శామ్యూల్స్.. కెరీర్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 11 వేల పైచిలుకు పరుగులు చేసి, గుర్తింపు తెచ్చుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. బాలీవుడ్​ నటుడు కన్నుమూత

హిందీ చిత్రసీమలో సహాయనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఫరాజ్ ఖాన్.. బుధవారం మరణించారు. నటి పూజా భట్ ఈ మేరకు ట్వీట్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.