ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@1PM

author img

By

Published : Oct 31, 2020, 1:00 PM IST

ETV BHARAT TOP TEN NEWS
టాప్​టెన్​ న్యూస్​@1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

1. సాయం చేయండి

ఉప్పల్​ జీహెచ్​ఎంసీ కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు సహాయం అందించడంలో వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ వందలాది మంది వరద బాధితులు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. భాజపా మోసం చేస్తోంది

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. తెరాస అభ్యర్థి ప్రచారం గ్రామాల్లో బోనాలు, బతుకమ్మలతో హోరెత్తుతోంది. రాయపోల్ మండలం ఎల్కల్, బేగంపేట్, వడ్డేపల్లి, కొత్తపల్లి, రామ్ సాగర్ గ్రామాల్లో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బోనాలు, బతుకమ్మలతో ప్రజలు భారీగా తరలివచ్చి మంత్రికి ఘన స్వాగతం పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. హోరాహోరీగా..

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. తెరాస అభ్యర్థి ప్రచారం గ్రామాల్లో బోనాలు, బతుకమ్మలతో హోరెత్తుతోంది. రాయపోల్ మండలం ఎల్కల్, బేగంపేట్, వడ్డేపల్లి, కొత్తపల్లి, రామ్ సాగర్ గ్రామాల్లో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. చరిత్ర సృష్టిస్తాం

దుబ్బాక ఉపఎన్నిక పోరు రసవత్తరంగా మారుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఆ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ట్రంప్​కే మద్దతు

అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ పైనే భారతీయ-అమెరికన్​ ఓటర్లు ఎక్కువ నమ్మకం పెట్టుకున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు, సీఏఏపై డెమొక్రటిక్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు, ప్రధాని మోదీతో ట్రంప్​కు ఉన్న స్నేహసంబంధం, చైనాతో ఉద్రిక్తతల సమయంలో భారత్​కు అమెరికా మద్దతుగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ఇందిరా గాంధీకి ప్రముఖుల నివాళి

మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరా గాంధీ 36వ వర్ధంతి సందర్భంగా.. కాంగ్రెస్​ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆమె సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ట్వీట్​ చేశారు సోనియా, రాహుల్​ గాంధీ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. అరుదైన గౌరవం

భారత ఫార్మా బయోకాన్​కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయంగా టాప్​-5లో చోటు దక్కించుకుంది. రీజెనరాన్​, అలిమినిలామ్​, ఇన్​సైట్​, జింజెంటా కంపెనీలు.. వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. సమస్యల పథంలోనే..

దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. అంత ఖర్చుతో కూడిన 5జీ నెట్‌వర్క్‌- భారత్‌కు ఇప్పుడు అవసరం లేదని వాదిస్తున్నారు మరికొందరు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ముదురుతున్న వివాదం

టీమ్​ఇండియా కెప్టెన్ ద్వయం విరాట్​ కోహ్లీ, రోహిత్​ శర్మల మధ్య గతేడాది ప్రపంచకప్​ నుంచి విభేదాలు కొనసాగుతున్నాయని వినికిడి. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఉన్న సఖ్యత దెబ్బతిందని పలువురు క్రికెట్​ విశ్లేషకులు అంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. కాజల్​ పెళ్లి ఫొటోలు చూశారా..?

నటి కాజల్ అగర్వాల్​ పెళ్లి శుక్రవారం ఘనంగా జరిగింది. తన స్నేహితుడు, బిజినెస్​మెన్ గౌతమ్ కిచ్లును వివాహమాడిందీ భామ. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.