ETV Bharat / city

బొగ్గు ఎంత కావాలో అంచనా వేయండి: కేంద్ర విద్యుత్‌ శాఖ

author img

By

Published : May 30, 2022, 8:47 AM IST

థర్మల్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ఎంత బొగ్గు అవసరమో అంచనాలు వేయాలని కేంద్ర విద్యుత్‌ మండలి(సీఈఏ)కి కేంద్ర విద్యుత్‌ శాఖ ఆదేశాలు జారీచేసింది. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ‘భారత ఇంధన ఎక్స్ఛేంజీ’లో అమ్ముకునే థర్మల్‌ కేంద్రాలు శక్తి-బి’ పథకం కింద బొగ్గును కొంటున్నాయి.

coal
coal

విద్యుదుత్పత్తికి థర్మల్‌ కేంద్రాల్లో ఎంత బొగ్గు అవసరమో అంచనాలు వేయాలని కేంద్ర విద్యుత్‌ మండలి(సీఈఏ)కి కేంద్ర విద్యుత్‌ శాఖ ఆదేశాలు పంపింది. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ‘భారత ఇంధన ఎక్స్ఛేంజీ’లో అమ్ముకునే థర్మల్‌ కేంద్రాలు శక్తి-బి’ పథకం కింద బొగ్గును కొంటున్నాయి. వీటికి అమ్మే బొగ్గులో 10 శాతం తప్పనిసరిగా విదేశీ బొగ్గు ఉండాల్సిందేనని కేంద్రం పేర్కొంది. విదేశీ బొగ్గు 10% వాడితే అది మన దేశంలో వాడేదానిలో 15%తో సమానమంది. అయితే తెలంగాణలోని థర్మల్‌ కేంద్రాలకు విదేశీ బొగ్గు కొనే ప్రసక్తే లేదని రాష్ట్ర జెన్‌కో స్పష్టం చేసింది. సింగరేణి బొగ్గు తక్కువ ధరకు వస్తున్నందున ఎక్కువ ధరకు విదేశీ బొగ్గు ఎందుకు కొనాలని జెన్‌కో వాదిస్తోంది.

ఇవీ చదవండి : బెంబేలెత్తిస్తున్న ప్లాస్టిక్‌ భూతం.. భారీగా పెరుగుతున్న వినియోగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.