ETV Bharat / city

'కేసీఆర్​కు ప్రజల గురించి పట్టించుకునే తీరిక లేదు'

author img

By

Published : May 2, 2021, 11:07 AM IST

తనకు అడ్డువచ్చిన వారిని ఎలా తొలగించాలనే కుట్రలు తప్ప కరోనా కష్టకాలంలో ప్రజలను పట్టించుకోవాలనే ధ్యాసే సీఎం కేసీఆర్​కు లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. హైదరాబాద్​ పంజాగుట్ట సర్కిల్​లో ఉచిత మాస్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

dasoju shravan kumar, dasoju shravan kumar about corona pandemic, Hyderabad news
దాసోజు శ్రవణ్ కుమార్, ఈటల విషయంపై దాసోజు స్పందన, కరోనా కేసులపై దాసోజు వ్యాఖ్యలు

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రించడంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యమయ్యాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం పెద్దన్న పాత్ర పోషిస్తూ.. దేశవ్యాప్తంగా సేవలందిస్తోందని తెలిపారు. హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్​లో సోమాజిగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు నరికేల నరేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మాస్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సోనియా గాంధీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవిడ్ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని దాసోజు తెలిపారు. ఆక్సిజన్, రెమ్​డెసివిర్, కరోనా పడకలు అందుబాటులోకి తీసుకురావడం, బాధితులకు సకాలంలో అంబులెన్స్​లు ఏర్పాటు చేయడం వంటి సేవలందిస్తున్నట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.