ETV Bharat / city

AP CORONA: ఏపీలో కొత్తగా 1,908 కరోనా కేసులు.. 23 మరణాలు

author img

By

Published : Aug 7, 2021, 7:49 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 1,908 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 23 మంది ప్రాణాలు కోల్పోగా... మొత్తం మృతుల సంఖ్య 13, 513కి చేరింది.

corona
కరోనా కేసులు

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 80,376 మందికి పరీక్షలు నిర్వహించగా.. 1,908 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 19 లక్షల 80 వేల 258కి చేరింది. తాజాగా.. 23 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 13,513కి పెరిగింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,46,370కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,375 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,51,08,146 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

corona
ఏపీ బులిటెన్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.