ETV Bharat / sports

భారత్ భళా- ఒలింపిక్స్​లో అత్యుత్తమ ప్రదర్శన ఇదే..

author img

By

Published : Aug 7, 2021, 6:25 PM IST

విశ్వక్రీడలపై మువ్వన్నెల జెండా మెరిసింది. ఓ స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో ఒలింపిక్స్​లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది భారత్​. లండన్ ఒలింపిక్స్​లో సాధించిన ఆరు పతకాల రికార్డును తిరగరాసింది.

INDIA OLYMPICS
భారత్ భళా- ఒలింపిక్స్​లో ఉత్తమ ప్రదర్శన

టోక్యో ఒలింపిక్స్​లో భారత్ అదరగొట్టింది. అన్ని క్రీడల్లో అత్యుత్తమంగా రాణించింది. ఏకంగా ఏడు పతకాలు సాధించి.. ఒలింపిక్స్​లో ఉత్తమ ప్రదర్శన రికార్డును తిరగరాసింది. లండన్ ఒలింపిక్స్(2012)లో సాధించిన 6 పతకాలు ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉన్నాయి.

పతకం కోసం రోజుల తరబడి ఎదురుచూడకుండా.. ఒలింపిక్స్ ప్రారంభమైన రెండోరోజే సిల్వర్ మెడల్​ను భారత్ తన ఖాతాలో వేసుకుంది. వెయిట్​లిఫ్టర్ మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో రజతాన్ని కొల్లగొట్టింది. బ్యాడ్మింటన్​లో పీవీ సింధు(కాంస్యం), బాక్సింగ్​లో లవ్లీనా(కాంస్యం), రెజ్లింగ్​లో బజరంగ్ పునియా(కాంస్యం), రవి కుమార్ దహియా(రజతం) పతకాలు సాధించారు.

INDIA OLYMPICS
మీరాబాయి
INDIA OLYMPICS
పీవీ సింధు

మరోవైపు, భారత హాకీ జట్టు ఒలింపిక్స్​లో అద్భుత ప్రదర్శన చేసింది. 41 ఏళ్ల విరామ వీడ్కోలు పలుకుతూ కాంస్యం గెలుచుకొని యావత్​భారతావనిని తలెత్తుకునేలా చేసింది. ఇక శనివారం భారత స్వర్ణ పతక ఆశలను తీరుస్తూ.. నీరజ్ చోప్రా చరిత్ర లిఖించాడు. అథ్లెటిక్స్​లో తొలి స్వర్ణాన్ని భారత్​కు తీసుకొచ్చాడు. భారత్‌కు ఒలింపిక్స్‌ వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా తర్వాత స్వర్ణం అందించిన రెండో క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా రికార్డుకెక్కాడు.

INDIA OLYMPICS
నీరజ్ చోప్రా
INDIA OLYMPICS
హాకీ జట్టు

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన నీరజ్​ చోప్రా- భారత్​కు స్వర్ణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.