ETV Bharat / city

AP Corona Cases: ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 14,502 కేసులు, ఏడు మరణాలు

author img

By

Published : Jan 24, 2022, 8:20 PM IST

AP corona cases today: ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 14,502 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా విశాఖ జిల్లాలో కొవిడ్ బారిన పడ్డారు. రాష్ట్రంలో వైరస్​ బారిన పడి మరో ఏడుగురు మరణించారు.

AP corona cases today
ఏపీలో కరోనా కేసులు

AP corona cases today: ఆంధ్రప్రదేశ్​లో రోజురోజుకూ కొవిడ్​ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 40,266 నమూనాలు పరీక్షించగా.. 14,502 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​ కారణంగా మరో ఏడుగురు మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు మరణించగా.. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మహమ్మారికి బలయ్యారు. కరోనా బారి నుంచి తాజాగా 4,800 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 93,305 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.

అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,728 మంది కొవిడ్​ బారిన పడ్డారు. కరోనాతో పోరాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 14,549 మంది మృతి చెందారు.

AP corona cases today
ఏపీలో కరోనా కేసుల వివరాలు

దేశంలో ఒక్కరోజే 3 లక్షల కరోనా కేసులు.. 439 మరణాలు

Corona cases in India: భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. 24 గంటల వ్యవధిలో.. 3,06,064 కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 439 మంది మరణించారు. 2,43,495 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 20.75 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 93.07గా నమోదైందని పేర్కొంది. యాక్టివ్ కేసుల సంఖ్య 241 రోజుల గరిష్ఠానికి చేరుకుందని వెల్లడించింది.

Vaccination in India

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 27,56,364 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,62,26,07,516 కి చేరింది.

ఇదీ చదవండి: Telangana Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 3,980 కరోనా కేసులు, 3 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.