ETV Bharat / city

Ap Corona: ఏపీలో కొత్తగా 215 కరోనా కేసులు, ఒకరు మృతి

author img

By

Published : Nov 6, 2021, 8:16 PM IST

ఏపీలో కరోనా కేసులు(corona cases) తగ్గుముఖం పట్టాయి. శనివారం కొత్తగా 215 కేసులు వెలుగుచూశాయి. కొవిడ్ కారణంగా ఒకరు మృతి చెందారు.

ఏపీ
ఏపీ

గడిచిన 24 గంటల్లో ఏపీలో 30,831 మందికి కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు(corona tests) నిర్వహించగా.. 215 కరోనా కేసులు బయటపడ్డాయి. వైరస్ కారణంగా కృష్ణా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. కరోనా నుంచి మరో 406 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,568 కరోనా యాక్టివ్‌ కేసులు(corona active cases) ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

జిల్లాల వారీగా కరోనా కేసులు..

అనంతపురంలో 4, చిత్తూరులో 33, తూర్పుగోదావరిలో 26, గుంటూరులో 24, కడపలో 11, కృష్ణాలో 37, కర్నూలులో 1, నెల్లూరులో 17, ప్రకాశంలో 12, శ్రీకాకుళంలో 12, విశాఖపట్నంలో 27, విజయనగరంలో 1, పశ్చిమగోదావరిలో 10 కేసులు నమోదయ్యాయి.

Corona
ఏపీలో కొత్తగా 215 కరోనా కేసులు

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.