ETV Bharat / city

రాష్ట్రంలో మరో 163 కరోనా కేసులు.. ఒకరు మృతి

author img

By

Published : Jan 31, 2021, 9:32 AM IST

తెలంగాణలో తాజాగా మరో 163 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో వైరస్ సోకి ఇప్పటివరకు 1,599 మంది మరణించారు.

corona cases and deaths in telangana today
తెలంగాణలో కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 163 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి ఒకరు మరణించారు. ఇప్పటివరకు తెలంగాణలో 2,94,469 మంది మహమ్మారి బారిన పడ్డారు.

వైరస్ సోకి రాష్ట్రంలో ఇప్పటివరకు 1,599 మంది మృతి చెందగా.. మరో 276 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి వైరస్ బారి నుంచి కోలుకున్న బాధితుల సంఖ్య 2,90,630కి చేరింది.

తెలంగాణలో ప్రస్తుతం 2,240 కరోనా యాక్టివ్ కేసులుండగా.. 828 మంది బాధితులు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 28 కరోనా కేసులు నమోదయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.