ETV Bharat / city

అపార్టుమెంట్​వాసులకు 20వేల లీటర్ల ఉచితనీరు: కేసీఆర్

author img

By

Published : Nov 28, 2020, 7:29 PM IST

cm kcr comments on electricity in lb stadium ghmc election meeting
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సాధించిన ఘనత.. విద్యుత్: కేటీఆర్

ప్రత్యేక రాష్ట్రంలో విద్యుత్​తోనే తొలి ఘనత సాధించామని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా తెలంగాణలో ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నట్టు వివరించారు.

ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సాధించిన తొలి ఘనత విద్యుత్​తోనేనని ముఖ్యమంత్రి కేసీఆర్​ చెప్పుకొచ్చారు. తలసరి విద్యుత్​ వాడకంలో తెలంగాణ నెంబర్​వన్​గా నిలిచినట్టు కేంద్రమే చెప్పిందని వెల్లడించారు. తాగునీటి సమస్యకు భరతవాక్యం పలికామని వ్యాఖ్యానించారు.

కొద్ది నెలల్లోనే నగర ప్రజలకు, పేదలకు 24 గంటలు ఉచిత కానుకగా తాగునీరు అందించామని కేసీఆర్ అన్నారు. ఐదేళ్లలో మిషన్​ భగీరథ పూర్తి చేశామని... అపార్ట్​మెంట్​ వాసులకు 20 వేల లీటర్ల ఉచిత నీరిందించనున్నట్టు తెలిపారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రభుత్వ పథకాల అమలు చేస్తున్నట్టు వివరించారు.

ఇదీ చూడండి: చైతన్యవంతులు అభివృద్ధికే పట్టం కడతారు: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.