ETV Bharat / city

CM Jagan Meet CJI: సీజేఐకి తేనీటి విందు.. మంత్రులను పరిచయం చేసిన ఏపీ సీఎం

author img

By

Published : Dec 25, 2021, 6:40 PM IST

cm jagan cji
సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందు

CM Jagan Meet CJI: సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందు ఇచ్చింది. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం జగన్​, మంత్రులు, ఏపీ, తెలంగాణ హైకోర్టుల న్యాయమూర్తులు హాజరయ్యారు.

CM Jagan Meet CJI: సీజేఐ ఎన్వీ రమణ గౌరవార్థం.. ఏపీ ప్రభుత్వం తేనీటి విందు ఇచ్చింది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన తేనీటి విందు కార్యక్రమానికి సీఎం జగన్, మంత్రులు, ఏపీ, తెలంగాణ హైకోర్టుల న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తేనీటి విందులో సీజేఐకి.. రాష్ట్ర మంత్రులను ముఖ్యమంత్రి జగన్ పరిచయం చేశారు.

AP CM Jagan couples Meet CJI: అంతకు ముందు సీజేఐ ఎన్వీ రమణ దంపతులను సీఎం జగన్‌ దంపతులు కలిశారు. విజయవాడ నోవాటెల్ హోటల్‌లో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు.. సీఎం జగన్ దంపతులు పుష్పగుచ్ఛం అందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.