ETV Bharat / city

'మృతదేహం ఇంటికి పంపిన తర్వాత.. మళ్లీ తీసుకెళ్లడమెందుకు?'

author img

By

Published : Dec 7, 2020, 10:53 PM IST

chandrababu-tweet-on-eluru-mysterious-deaths
'మృతదేహం ఇంటికి పంపిన తర్వాత.. మళ్లీ తీసుకెళ్లడమెందుకు?'

ఏపీలోని ఏలూరులో వింత వ్యాధితో మృతి చెందిన శ్రీధర్​ మృతదేహం వివాదంపై చంద్రబాబు స్పందించారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వచ్చిన మృతదేహాన్ని మళ్లీ పోస్టుమార్టం కోసం ఎందుకు తీసుకెళ్లారని చంద్రబాబు ట్వీట్ చేశారు.

'మృతదేహం ఇంటికి పంపిన తర్వాత.. మళ్లీ తీసుకెళ్లడమెందుకు?'

ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరులో వింత వ్యాధితో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఆ వ్యాధితో నిన్న శ్రీధర్ అనే వ్యక్తి మృతి చెందారు. శ్రీధర్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు అప్పగించారు. మళ్లీ పోస్టుమార్టం చేయాలంటూ.. మృతదేహం కోసం ఇంటికి వెళ్లారు. ఈ విషయంపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం చేశాకే మృతదేహాన్ని ఇస్తారని.. మళ్లీ ఎందుకు తీసుకెళ్లడం అంటూ ఆవేదన చెందారు. దీనికి సంబంధించిన వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్​లో పోస్టు చేశారు.

ఇదీ చదవండి:సెల్ఫీ వీడియో: తల్లి అంగీకరించలేదని ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.