ETV Bharat / city

తెలుగు ప్రజలకు ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం స్పందిస్తుంది: చంద్రబాబు

author img

By

Published : Mar 11, 2022, 4:57 AM IST

Updated : Mar 11, 2022, 5:32 AM IST

Chandrababu: తెలుగు ప్రజలకు ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం స్పందిస్తుందని పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థులు, తెదేపా ఎంపీలతో ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయన భేటీ అయ్యారు.

తెలుగు ప్రజలకు ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం స్పందిస్తుంది: చంద్రబాబు
తెలుగు ప్రజలకు ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం స్పందిస్తుంది: చంద్రబాబు

Chandrababu: తెలుగు ప్రజలకు ఏ కష్టం వచ్చినా.. తెలుగుదేశం స్పందిస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థులతో పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో చంద్రబాబు భేటీ అయ్యారు. అధికారంలో లేకపోయినా.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్ధులకు సాధ్యమైన సాయం చేయగలిగామన్నారు. ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులకు ఇక్కడే అడ్మిషన్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. విద్యార్థులను స్వదేశానికి తరలించడంలో సహకరించిన అనుబంధ విభాగాలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

యుద్ద సమయంలో తమ కష్టాలను చూసి ధైర్యం చెప్పడంతో పాటు స్వస్థలాకు చేర్చేందుకు కృషిచేసిన చంద్రబాబుకు... ఈ సందర్భంగా విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్దులకు సాయం అందించే విషయంలో చంద్రబాబు సమర్ధవంతంగా నడిపించారని ఎంపీలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్, రామ్మోహన్ నాయుడు, ఎన్ఆర్ఐ తెదేపాఅధ్యక్షులు రాజశేఖర్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ప్రజలకు ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం స్పందిస్తుంది: చంద్రబాబు

ఇదీ చదవండి:

Last Updated : Mar 11, 2022, 5:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.