ETV Bharat / city

'ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసింది.. ఇక తగ్గేదేలే'

author img

By

Published : May 18, 2022, 4:29 PM IST

chandrababu comments on Jagan
chandrababu comments on Jagan

Chandrababu Comments On Jagan : జగన్ లాంటి నియంతలకు తాను భయపడనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీ సీఎం చెప్పిన రాయలసీమ ఎత్తిపోతల ఏమైందని ప్రశ్నించారు. కడపలో జరిగిన జిల్లా స్థాయి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో బాబు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసిందని ఇక వారిని ఎవరూ ఆపలేరన్నారు.

'ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసింది.. ఇక తగ్గేదేలే'

Chandrababu Comments On Jagan : మూడేళ్ల జగన్ పాలన పూర్తి వైఫల్యంగా సాగిందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అందరిపై బాదుడే బాదుడుతో మోయలేని భారం మోపుతున్నారని విమర్శించారు. కడపలో జరిగిన జిల్లా స్థాయి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన.. వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసిందని ఇక వారిని ఎవరూ ఆపలేరన్నారు. జగన్ లాంటి నియంతలకు తాను భయపడనని అన్నారు.తెదేపా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వైకాపా ప్రభుత్వ దోపిడిని వివరించాలన్నారు. దొంగ లెక్కలు రాయటం..దొరికిపోవటం జగన్ తీరని ఎద్దేవా చేసిన చంద్రబాబు..అప్పులతో రాష్ట్ర పరువు తీస్తున్నారని ఆక్షేపించారు.

గుంటూరుకు చెందిన వెంకాయమ్మ ఏపీ ప్రభుత్వ తీరుపై వాస్తవాలు చెబితే ఆమె ఇంటిపై దాడి చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల్లో ఇద్దరు తెదేపా నుంచి వెళ్లినవాళ్లే ఉన్నారన్నారు. సీబీఐ కేసుల్లో తనతో ఉన్నవారితో పాటు, కేసులు వాదించిన వారికి జగన్‌ రాజ్యసభ సీట్లు ఆఫర్ చేశారని ఆక్షేపించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరిని రాజ్యసభకు పంపుతున్నారని.., రాజ్యసభకు పంపేందుకు ఏపీలో సమర్థులు లేరా ? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

"ఒంగోలులో మహానాడుకు స్టేడియం ఎందుకివ్వలేదు. కడపలో అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా ?. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ దోపిడీని వివరించాలి. జగన్ చెప్పిన రాయలసీమ ఎత్తిపోతల ఏమైంది. పులివెందులలో బస్టాండ్‌ కట్టలేనివాళ్లు 3 రాజధానులు కడతారా ?. పులివెందులలో రైతులకు బీమా ఎందుకు రావడం లేదు. బైక్‌పై మృతదేహాన్ని తరలిస్తే సీఎం కనీసం స్పందించారా ?. అత్యాచార బాధితులను కనీసం పరామర్శించారా ?. కడప విమానాశ్రయం వద్ద కార్యకర్తలపై ఆంక్షలా ?." -చంద్రబాబు, తెదేపా అధినేత

అంతకు ముందు 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో పాల్గొనేందుకు కడప జిల్లాకు చేరుకున్న చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. కడప విమానాశ్రయం వద్దకు పెద్దఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు తరలిరాగా.. వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. ప్రధాన రహదారి వద్ద కార్యకర్తలను ఆపివేశారు. దీంతో పోలీసులు, తెదేపా కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.