ETV Bharat / city

uppudu biyyam Purchase Issue : ఉప్పుడు బియ్యానికి మోక్షం

author img

By

Published : Oct 2, 2021, 8:53 AM IST

uppudu biyyam Purchase Issue
uppudu biyyam Purchase Issue

ఉప్పుడు బియ్యం కొనుగోలు(uppudu biyyam Purchase Issue)పై ముఖ్యమంత్రి కేసీఆర్ వినతిని కేంద్రం అంగీకరించింది. అదనంగా మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకునేందుకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒప్పుకొంది. ఈ ఒక్కసారి మాత్రమే అదనంగా తీసుకుంటామని స్పష్టం చేసింది.

ఉప్పుడు బియ్యం(uppudu biyyam Purchase Issue) వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. అదనంగా 20 లక్షల మెట్రిక్‌ టన్నులు తీసుకునేందుకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒప్పుకొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌(Telangana chief minister KCR) వినతి మేరకు ఈ ఒక్కసారి మాత్రమే అదనంగా తీసుకుంటామని స్పష్టం చేసింది.

గడిచిన యాసంగిలో రాష్ట్రం 92 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని(uppudu biyyam Purchase Issue) కొనుగోలు చేసింది. వాటి నుంచి 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యం(uppudu biyyam Purchase Issue) వస్తాయి. సీజను ఆరంభానికి ముందుగానే 24.75 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యం(uppudu biyyam Purchase Issue) రూపంలో మిగిలిన వాటిని సాధారణ బియ్యంగా ఇవ్వాలని కేంద్రం కోరింది. కనీసం 50 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యం(uppudu biyyam Purchase Issue) తీసుకోవాలని రాష్ట్రం పదేపదే విన్నవించింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ వెళ్లి రెండు దఫాలు కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌(Central minister piyush goyal)ను కలిసి పరిస్థితి వివరించారు.

ఇకముందు ఎఫ్‌సీఐకి ఉప్పుడు బియ్యం ఇవ్వమని చెప్పిన రాష్ట్రం

రానున్న కాలంలో ఎఫ్‌సీఐ(food corporation of India)కి ఉప్పుడు బియ్యం(uppudu biyyam Purchase Issue) ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం(Telangana chief minister KCR) లిఖిత పూర్వకంగా స్పష్టం చేసిందని కేంద్ర ప్రజాపంపిణీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ పరిశ్రమను ప్రోత్సహించేందుకు రాయితీలు ఇవ్వాలని ఉత్తర్వుల్లో కేంద్రం కోరింది. బలవర్ధక ఆహారం కోసం బియ్యంలో విటమిన్ల మూలకాలను కలిపేందుకు అవసరమైన యూనిట్ల ఏర్పాటుకు సౌకర్యాలను కల్పించాలంది. మిల్లుల్లోని ధాన్యం నిల్వలను లెక్కించేందుకు సదుపాయాలు కల్పించాలని, వడ్ల సేకరణలో మరింత సౌలభ్యానికి భూ రికార్డులను ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌కు అనుసంధానించాలని కోరింది. లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యాన్ని(uppudu biyyam Purchase Issue) అందించేందుకు ప్రమాణాలను పూర్తిస్థాయిలో పాటించాలని కేంద్రం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.