ETV Bharat / city

భాగ్యనగరాన్ని ముంచెత్తిన వరదలు.. కారుపై కారు ఎక్కిన దృశ్యం

author img

By

Published : Oct 14, 2020, 10:25 PM IST

భాగ్యనగరాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. వందల కాలనీల్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించింది. ప్రవాహానికి నగరంలోని పలు కాలనీల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. పలు అపార్టమెంట్లలోని సెల్లార్​లోకి వరద నీరు చేరింది.

cars washed away in rain water in hyderabad
భాగ్యనగరాన్ని ముంచెత్తిన వరదలు.. కారుపై కారు ఎక్కిన దృశ్యం

భాగ్యనగరాన్ని ముంచెత్తిన వరదలు.. కారుపై కారు ఎక్కిన దృశ్యం

హైదరాబాద్​ను భారీ వరదలు అతలాకుతలం చేశాయి. వందల కాలనీలను వరదనీరు ముంచెత్తింది. వరదలకు జంటనగరాలు చిగురుటాకులా వణికాయి. సికింద్రాబాద్​ న్యూబోయిన్​పల్లిలో వరద ఉద్ధృతికి కాలనీల్లోని కార్లు కొట్టుకుపోయాయి. వరద తాకిడికి ఒక కారుపై మరో కారు ఎక్కిన దృశ్యం అందరిని భయభ్రాంతులకు గురిచేసింది.

సెల్లార్​ నిండిపోయింది... కారును తాళ్లతో లాగారు

నగరంలోని మణికొండలో గల ఓ అపార్ట్​మెంట్​లోని సెల్లార్​ వర్షపు నీటితో నిండిపోయింది. పార్క్​ చేసిన కార్లు సెల్లార్​లోని నీటిలోనే మునిగిపోయాయి. స్థానికులు తాళ్ల సాయంతో కార్లను సెల్లార్​ నుంచి బయటకు లాగారు.

పల్టీ కొట్టిన పడవ

హైదరాబాద్​ పాతబస్తీ షాహీన్​ నగర్​లో భారీగా వరద నీరు చేరింది. బోటు సహాయంతో ఏడుగురిని సురక్షిత ప్రాంతానికి జీహెచ్​ఎంసీ చేర్చుతుండగా... బరువు పెరిగి పడవ నీళ్లలో పల్టీ కొట్టింది. నీటిలో మునిగిన వారందరిని జీహెచ్​ఎంసీ సిబ్బంది కష్టపడి కాపాడారు.

ఇవీ చూడండి: ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి.. కాపాడిన స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.