ETV Bharat / city

BEAR ATTACK: తోటలోకి దూసుకొచ్చి.. 8 మంది రైతులపై ఎలుగుబంటి దాడి

author img

By

Published : Jun 20, 2022, 3:56 PM IST

ఎలుగుబంటి దాడి!
ఎలుగుబంటి దాడి!

BEAR ATTACK: ఏపీ శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగిలో స్థానికులు, పశువులపై ఎలుగుబంటి విరుచుకుపడింది. దాడిలో ఎనిమిది మంది రైతులు గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎలుగుబంటి దాడితో గ్రామంలో భయాందోళన పరిస్థితి నెలకొంది.

BEAR ATTACK: ఏపీ శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. కిడిసింగి-వజ్రపుకొత్తూరు మధ్య జీడి, కొబ్బరితోటల్లో పనిచేస్తున్న ఎనిమిది మంది రైతులపై దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వజ్రపుకొత్తూరుకు చెందిన అప్పలస్వామి, పురుషోత్తం, చలపతి, షణ్ముఖరావు, సంతోష్‌, తులసీదాస్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఎలుగుబంటి దాడిలో 10 పశువులు కూడా తీవ్రంగా గాయపడ్డాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ విషయంపై మంత్రి సీదిరి అప్పలరాజు ఆరా తీశారు. తక్షణమే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి ఎలుగుబంటి దాడుల నుంచి తమను కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చదవండి : Secunderabad agnipath protest: 'వాట్సాప్​ గ్రూపుల్లో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు'

రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీ.. డ్రైవర్​ పరార్​.. బాధితుడు అక్కిడక్కడే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.