ETV Bharat / city

నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులకు ఏపీ గవర్నర్‌ ఆమోదం

author img

By

Published : Jun 14, 2021, 10:46 PM IST

AP governor
AP governor

ఏపీలో నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు. నామినేటెడ్ ఎమ్మెల్సీలు త్వరలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఏపీలో నాలుగు నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా తోట త్రిమూర్తులు, రమేశ్‌ యాదవ్‌, లేళ్ల అప్పిరెడ్డి, మోసేన్‌ రాజుల పేర్లను ప్రభుత్వం సూచించగా.. గవర్నర్ ఆమోదించారు. అంతకుముందు గవర్నర్‌ను కలిసిన సీఎం జగన్‌ నామినేటెడ్ అభ్యర్థుల గురించి వివరించారు. అభ్యర్థులు త్వరలో ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఇదీచదవండి: Ktr Tour: రేపు సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో మంత్రి కేటీఆర్‌ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.