ETV Bharat / city

రెండవ మోతాదు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఏపీ గవర్నర్

author img

By

Published : Mar 31, 2021, 10:40 PM IST

ap governor
రెండవ మోతాదు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఏపీ గవర్నర్

ఏపీ గవర్నర్ దంపతులు రాజ్​భవన్‌లో రెండవ మోతాదు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అర్హత కలిగిన వారంతా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ చెప్పారు.

అర్హత కలిగిన వారంతా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సతీమణితో కలిసి.. రాజ్​భవన్‌లో రెండవ మోతాదు కొవిడ్ వ్యాక్సిన్​ను గవర్నర్ తీసుకున్నారు. తొలిదశ టీకా తీసుకున్న తర్వాత జ్వరం, నొప్పి వంటి ప్రతికూల ప్రభావాలు తమకు ఎదురుకాలేదని గవర్నర్ చెప్పారు.

వ్యక్తులు తమ ఆరోగ్యం కోసం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం సురక్షితమేకాక.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కచ్చితంగా అవసరమని స్పష్టం చేశారు. కరోనాపై పోరులో రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు తమదైన భూమికను పోషించారని అన్నారు.

ఇదీ చదవండి: రేపటి నుంచి 45 ఏళ్లు దాటిన వారికి కొవిడ్ వ్యాక్సిన్: డీహెచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.