ETV Bharat / city

జీఈఎస్​లో కేసీఆర్​ ఆతిథ్యానికి ట్రంప్​ ఫిదా​

author img

By

Published : Feb 26, 2020, 7:34 AM IST

Updated : Feb 27, 2020, 10:24 AM IST

రాష్ట్రపతి భవన్​లో అమెరికా అధ్యక్షుడి గౌరవార్థం ఇచ్చిన విందు సందర్భంగా కేసీఆర్​, ట్రంప్​ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. 2018లో నిర్వహించిన జీఈఎస్​ సదస్సు ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది.

america president dobaldo trump appreciate telangan cm chandra shekar rao
కేసీఆర్​ ఆతిథ్యాన్ని మెచ్చుకున్న ట్రంప్​

ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్‌)కు ఆతిథ్యం బాగుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అభినందించారు. రాష్ట్రపతిభవన్‌లో మంగళవారం రాత్రి నిర్వహించిన విందు సందర్భంగా ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌తో కరచాలనం చేసి జీఈఎస్‌ గురించి ప్రస్తావించారు. సదస్సుకు మీరు హాజరవుతారని భావించామని ట్రంప్​తో కేసీఆర్​ అన్నట్లు తెలిసింది. సదస్సుకు రావాలని తాను ప్రయత్నించినా సాధ్యం కాలేదని అగ్రరాజ్య అధినేత సమాధానమిచ్చినట్లు సమాచారం.

ఇదీ చూడండి: ట్రంప్‌ పర్యటనపై విదేశీ మీడియా ఏమందంటే..

Last Updated :Feb 27, 2020, 10:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.