ETV Bharat / city

రోడ్లు ఊడ్చిన సర్పంచ్​.. కారణం తెలిస్తే షాక్​..

author img

By

Published : Sep 10, 2022, 4:55 PM IST

కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లా

ఏపీలోని కర్నూలు జిల్లా ఆలూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ పంచాయతీలో నిధులను ప్రభుత్వం తీసుకోవడాన్ని నిరసిస్తూ ఆ గ్రామ సర్పంచ్ అరుణాదేవి రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. కనీసం ఉద్యోగులకు ఆరువేల వేతనం కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్​లో పంచాయతీ నిధులను తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం వల్ల తాత్కాలికంగా పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు చెల్లించలేని స్థితిలో ఉన్నామని ఆలూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అరుణాదేవి అన్నారు. ఈ విషయంపై ఆలూరు పట్టణంలో రోడ్లపై చెత్తను ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు. ఉదయం పంచాయతీ కార్మికులతో కలిసి పట్టణంలో చెత్త రిక్షాను తోసుకుంటూ నిరసన తెలిపారు.

పంచాయతీ నిధులను తీసుకుని తిరిగి చెల్లించకుంటే తాము పంచాయతీలో అభివృద్ధి పనులు ఎలా చేసేదని అరుణాదేవి ఆవేదన వ్యక్తంచేశారు. సిబ్బందికి కనీసం రూ.6 వేల వేతనం చెల్లించలేని దౌర్భాగ్యం నెలకొందని ఆమె అన్నారు.


ఇవీ చదవండి: మెస్‌ఛార్జీల పెంపు కొలిక్కి వచ్చేదెన్నడు..?

కేసీఆర్‌తోనే బంగారు భారత్.. జాతీయ పార్టీ స్థాపించాలని తెరాస నేతల విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.