ETV Bharat / city

క్రమశిక్షణ ఉల్లఘించిన వారిని ఉపేక్షించకూడదు: టీపీసీసీ

author img

By

Published : Sep 19, 2020, 8:53 PM IST

క్రమశిక్షణ ఉల్లఘించిన వారిని ఉపేక్షించకూడదు: టీపీసీసీ
క్రమశిక్షణ ఉల్లఘించిన వారిని ఉపేక్షించకూడదు: టీపీసీసీ

రాష్ట్రానికి చెందిన కేంద్ర మాజీ మంత్రులు, మాజీ రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ ఇంఛార్జ్​లతో ఏఐసీసీ ఇంఛార్జ్​ మాణిక్యం ఠాకూర్‌ జూమ్ ద్వారా సమావేశమయ్యారు. దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికతో పాటు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థల ఎన్నికలు, పట్టభద్రుల నియోజక వర్గాల మండలి ఎన్నికల్లో అనుసరించే వ్యూహాన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాణిక్యం ఠాకూర్​కు వివరించారు.

రాబోయే దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికతో పాటు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థల ఎన్నికలు, పట్టభద్రుల నియోజక వర్గాల మండలి ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కృషి చేస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు.. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్యం ఠాకూర్‌ హామీ ఇచ్చారు పార్టీ క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, కలిసి కట్టుగా పనిచేయాలని..క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిని ఉపేక్షించకూడదని కూడా పలువురు నాయకులు ఇంఛార్జ్​కు సూచించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మాజీ మంత్రులు, మాజీ రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ ఇంఛార్జ్​లతో జూమ్ ద్వారా సమావేశమైన ఏఐసీసీ ఇంఛార్జ్​ మాణిక్యం ఠాకూర్‌, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు అంశాలపై చర్చించారు.

సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస కృష్ణన్, మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి, మాజీ మంత్రులు గీతా రెడ్డిలతోపాటు పలువురు సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. మొదట పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఏఐసీసీ ఇంఛార్జ్​ మాణిక్యం ఠాకూర్‌కు నాయకులను పరిచయం చేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని పలువురు నాయకులు రాష్ట్ర ఇంఛార్జ్​ దృష్టికి తెచ్చారు. తెలంగాణ వచ్చాక, ఒక్క కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ లబ్ధి పొందలేదని వివరించారు.

తెలంగాణలో పత్రికలు, మీడియాపై తీవ్రమైన ఒత్తిళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వంతో ఛాలెంజ్ చేసి... మంత్రి శ్రీనివాస్​ యాదవ్‌తో కలిసి పర్యటించిన విషయాన్ని తెలిపారు. డబుల్ బెడ్​రూమ్ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.


ఇవీ చూడండి: వ్యవసాయ బిల్లులను విపక్షాలు అడ్డుకోవాలి: కాంగ్రెస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.