ETV Bharat / city

paddy procurement telangana: రాష్ట్రం నుంచి అదనంగా బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్​సిగ్నల్​

author img

By

Published : Dec 28, 2021, 2:16 PM IST

Updated : Dec 28, 2021, 4:41 PM IST

paddy
paddy

14:14 December 28

paddy procurement telangana: రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ

paddy procurement telangana: ఖరీఫ్ సీజన్​లో రాష్ట్రం నుంచి మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అదనంగా సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది. ఖరీఫ్ సీజన్​లో రాష్ట్రంలో పండించిన మొత్తం వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. మంత్రులు, ఎంపీల బృందం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్​ను కలిసి విజ్ఞప్తి చేసింది. లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది.

ఖరీఫ్ సీజన్​లో రాష్ట్రం నుంచి 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకోనున్నట్లు తెలిపింది. గతంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. సర్కారు విజ్ఞప్తితో ఇప్పుడు.. మరో ఆరు లక్షల టన్నులు అదనంగా తీసుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్​కు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ జైప్రకాష్ లేఖ రాశారు. 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం 68.65 లక్షల టన్నుల వరిధాన్యాన్ని సేకరించి ఇవ్వాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:

Last Updated :Dec 28, 2021, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.