ETV Bharat / city

భార్యతో కలిసున్నాడనే హత్య.. రిమాండ్​కు నిందితుడు

author img

By

Published : Nov 14, 2019, 11:18 PM IST

భార్యతో కలిసున్నాడనే హత్య.. రిమాండ్​కు నిందితుడు

చైతన్యపురి పీఎస్​ పరిధిలో ఈనెల 11న జరిగిన హత్యకేసులో నిందితుడు రవిని పోలీసులు అరెస్ట్​ చేశారు. అనుమానమే హత్యకు కారణమని తెలిపారు.

హైదరాబాద్​ చైతన్యపురి పోలీస్​స్టేషన్​ పరిధిలోని బాలాజీనగర్​లో ఈనెల 11న జరిగిన హత్యకేసును పోలీసులు చేధించారు. ప్రణీత్​రెడ్డి అనే యువకుడిని హతమార్చిన కేసులో నిందితుడు రవిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం మాచునూరి గ్రామానికి చెందిన ప్రణీత్​రెడ్డి.. హైదరాబాద్​లోని బాలాజీనగర్​లో నివాసం ఉంటున్న జ్యోతి అనే వివాహిత ఇంటికి వచ్చాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన జ్యోతి భర్త రవి.. ప్రణీత్​తో గొడవపడ్డాడు. తన ఇంట్లో ఉన్న తూకం రాయితో ప్రణీత్​ తలపై కొట్టి హతమార్చాడు. మృతుడు సొదరుడి ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఇవాళ రవిని అరెస్ట్​ చేశారు. అనుమానమే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.

భార్యతో కలిసున్నాడనే హత్య.. రిమాండ్​కు నిందితుడు

ఇవీచూడండి: బావా అక్కతో కలిసుండాలి.. అన్నందుకు బావమరిదిని చంపేశాడు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.