ETV Bharat / city

మూడోదశకు ముగిసిన ప్రచారం.. ఎల్లుండే పోలింగ్​

author img

By

Published : Feb 15, 2021, 10:34 PM IST

3rd-phase-election-campaign-closed IN AP
మూడోదశకు ముగిసిన ప్రచారం.. ఎల్లుండే పోలింగ్​

ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. ఎల్లుండి ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. బుధవారం రాష్ట్రంలో మూడో దఫా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 20 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 579 పంచాయతీలు, 11732 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,221 పంచాయతీలు, 19,607 వార్డులకు ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. పోలింగ్​ రోజునే ఫలితాలు వెల్లడిస్తారు.

ఇదీ చదవండి: బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన కిషన్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.