ETV Bharat / city

AP Corona Cases: ఏపీలో కొత్తగా 2,287 కేసులు, 18 మంది మృతి

author img

By

Published : Aug 1, 2021, 7:06 PM IST

ఏపీలో కొత్తగా 2 వేల 287 కరోనా కేసులు నమోదయ్యాయి. 18 మంది బాధితులు మహమ్మారి బారినపడి మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 21,019 యాక్టివ్‌ కేసులున్నట్టు అధికారులు వెల్లడించారు.

AP Corona Cases
AP Corona Cases

గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 85,856 పరీక్షలు నిర్వహించగా.. 2,287 కేసులు నిర్ధరణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు 19,68,462 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 18 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

ఏపీ వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,395కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,430 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,34,048కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 21,019 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,46,48,899 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

AP Corona Cases
ఏపీలో కొత్తగా 2,287 కేసులు, 18 మంది మృతి

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.