ETV Bharat / business

ఆర్థిక ఏడాది తొలి రోజున బుల్​ జోరు.. సెన్సెక్స్​ 700 ప్లస్​

author img

By

Published : Apr 1, 2022, 3:39 PM IST

Sensex surges
స్టాక్​ మార్కెట్లు

Stock markets: ఆర్థిక ఏడాది తొలి రోజున దేశీయ సూచీలు దూసుకెళ్లాయి. బ్యాంకు, గ్యాస్​, ఆయిల్​, స్థిరాస్తి రంగాల దూకుడుతో సెన్సెక్స్​ 59వేల ఎగువకు చేరింది. నిఫ్టీ 200 పాయింట్లకు పైగా లాభపడింది.

Stock markets: దేశీయ స్టాక్​ మార్కెట్లు.. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజున భారీ లాభాలను ఘడించాయి. ఉదయం ఫ్లాట్​గా ప్రారంభమైనప్పటికీ బ్యాంకు, ఆయిల్​, గ్యాస్​, విద్యుత్తు, స్థిరాస్తి రంగాల దూకుడుతో క్రమంగా పుంజుకున్నాయి. కొనుగోళ్లకు మదుపరులు మొగ్గు చూపగా.. సెన్సెక్స్​ 700 పాయింట్ల మేర లాభపడింది. నిఫ్టీ 200లకుపైగా వృద్ధి చెందింది.

  • ముంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 708 పాయింట్ల లాభంతో 59,276 వద్ద స్థిరపడింది.
  • జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ - నిఫ్టీ 206 పాయింట్లు వృద్ధి చెంది 17,670 వద్ద ముగిసింది.

లాభనష్టాల్లోనివి: ఎన్​టీపీసీ షేర్లు 6 శాతం మేర లాభపడ్డాయి. బీపీసీఎల్ 4 శాతం​, పవర్​ గ్రిడ్ 4 శాతం, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​ 3.5శాతం, ఎస్​బీఐ​ 3.1 శాతం మేర లాభాల్లోకి వెళ్లాయి. మరోవైపు.. హీరో మోటోకార్ప్​ 2.4 శాతం మేర నష్టపోయింది. టెక్​ మహీంద్రా, సన్​ ఫార్మా, ఎస్​బీఐ లైఫ్​ ఇన్స్యూరెన్స్​, టైటాన్​ కంపెనీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి: చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.