ETV Bharat / business

రికార్డు స్థాయిలో జీఎస్​టీ వసూళ్లు.. రూ.1.42 లక్షల కోట్లు రాబడి

author img

By

Published : Apr 1, 2022, 4:32 PM IST

GST collection
జీఎస్​టీ వసూళ్లు

GST collection in March 2022: జీఎస్​టీ వసూళ్లు రికార్డు స్థాయిని తాకాయి. అన్ని రికార్డులను తిరగరాస్తూ ఏకంగా రూ.1.42 లక్షల కోట్లు వసూళయ్యాయి. గతేడాది ఇదే నెల రాబ‌డుల‌తో పోల్చితే 15శాతం వృద్ధి న‌మోదైంది.

GST collections : దేశంలో జీఎస్​టీ ప్రవేశపెట్టిన తర్వాత వరుసగా ఆరోసారి జీఎస్​టీ వసూళ్లు లక్షా 30వేల కోట్లు దాటాయి. ఈ ఏడాది మార్చిలో జీఎస్​టీ వసూళ్లు జీవిత కాల గరిష్ఠాన్ని తాకాయి. ఏకంగా 1.42 లక్షల కోట్ల రాబడి వచ్చినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే నెల రాబడులతో పోల్చితే 15 శాతం వృద్ధి నమోదైంది.

మార్చిలో వచ్చిన జీఎస్​టీ రాబడుల్లో కేంద్ర జీఎస్​టీ కింద రూ.25.830 కోట్లు, రాష్ట్రాల జీఎస్​టీ కింద రూ.32,378 కోట్లు, సమీకృత జీఎస్​టీ కింద రూ.74,470 కోట్లు( అందులో దిగుమతులపై పన్ను వసూళ్ల ద్వారా రూ.39,131 కోట్లు వచ్చాయి.) సెస్​ కింద రూ.9,417 కోట్లు(అందులో దిగుమతుల ద్వారా రూ.981 కోట్లు) వచ్చాయి.

ఎగవేతదారులను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవడం సహా రిటర్న్​లు దాఖలు చేయడంలో మార్పులు చేసినందున నకిలీ ఇన్​వాయిల్​ల ద్వారా ఐటీసీ తీసుకునేందుకు అవకాశాలను నిలువరించింది కేంద్రం. ఇకపై నెల నెలా వచ్చే జీఎస్​టీ వసూళ్లూ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 2021 మార్చిలో వచ్చిన రాబడులతో పోలిస్తే ఈ ఏడాది 15 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: GST collections : మళ్లీ రూ.1.30 లక్ష కోట్లను దాటిన జీఎస్టీ రాబడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.