ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. క్రిప్టోకరెన్సీల రేటు ఎంతంటే?

author img

By

Published : Apr 18, 2022, 11:35 AM IST

gold
బంగారం

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో కిలో వెండి ధర రూ.972 పెరిగింది. మరోవైపు ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ.105.45, డీజిల్​ రూ.96.71గా ఉంది. క్రిప్టోకరెన్సీల్లో బిట్​కాయిన్​, ఇథీరియం ధరలు భారీగా తగ్గాయి.

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం 480 రూపాయలు పెరిగి రూ.55,250 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర కూడా రూ.972 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.71,972గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.54,770 గా ఉంది. కిలో వెండి ధర రూ.71,100 వద్ద కొనసాగుతోంది.

• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.55,250 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.71,972గా ఉంది.

• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.55,250 గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,972 వద్ద కొనసాగుతోంది.

• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.55,250 గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,972 వద్ద కొనసాగుతోంది.

  • స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,985 డాలర్లు పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 25.70 డాలర్లుగా ఉంది.

ఇంధన ధరలు ఇలా.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలను పెంచుకుంటూ వస్తున్న చమురు సంస్థలు పెట్రో బాదుడుకు విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు ఊరట లభించింది. గత గురువారం నుంచి చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ. 105.45, లీటర్​ రూ. 96.71గా ఉంది.

• ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.5 చేరగా, లీటర్​ డీజిల్​ రూ. 104.75గా ఉంది.

• వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ. 105.63గా కొనసాగుతోంది.

• హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.

Cryptocurrency Price in India: క్రిప్టో కరెన్సీల్లో బిట్​కాయిన్​, ఇథీరియంలు నష్టాలను నమోదు చేయగా.. ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల సూచీలు ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో బిట్​కాయిన్​ ధర రూ.85,000 తగ్గగా.. ఇథీరియం ధర రూ.7,543 తగ్గింది.

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర(రూ.ల్లో)
బిట్​కాయిన్31,42,362
ఇథీరియం2,35,881
డోజ్​కాయిన్10.93
టెథర్80.88
బీఎన్​బీ కాయిన్32,268

ఇదీ చూడండి : రికార్డ్​ స్థాయికి సీఎన్​జీ ధర.. కేంద్రం ఏమందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.