ETV Bharat / business

భారీగా పెరిగిన వెండి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Dec 21, 2022, 11:30 AM IST

gold rate today
ఈ రోజు బంగారం ధరలు

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి ధర భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి ధర భారీగా పెరిగింది. పది గ్రాముల బంగారం రూ.410 మేర పెరిగి ప్రస్తుతం రూ.56,300 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2088 పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి రూ.70,548 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.56,300గా ఉంది. కిలో వెండి ధర రూ.70,548 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.56,300 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.70,548గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.56,300గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,548వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.56,300 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.70,548గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,814.80 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.96 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.13,90,055 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.13,90,055
ఇథీరియంరూ.99,943
టెథర్​రూ.82.69
బైనాన్స్​ కాయిన్​రూ.20,512
యూఎస్​డీ కాయిన్రూ.82.61

స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పవనాల కారణంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్‌ 150 పాయింట్లు కోల్పోయి 61,552 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 18,346 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో విప్రో, టీసీఎస్​, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, భారతీయ ఎయిర్​టెల్​, రిలయన్స్​, యాక్సిస్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ, ఐటీసీ, టైటాన్​, కోటక్​ మహీంద్రా బ్యాంక్​, ఏసియన్​ పెయింట్స్​ షేర్లు నష్టాల జాబితాలో ఉన్నాయి.
రూపాయి విలువ:
డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు తగ్గి ప్రస్తుతం రూ. 82.75 వద్ద ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.