ETV Bharat / business

ఉగాది వేళ భారీగా తగ్గిన బంగారం... హైదరాబాద్, విజయవాడలో తాజా రేట్లు ఇవే

author img

By

Published : Mar 22, 2023, 11:24 AM IST

gold-rate-today-gold-price-in-hydrabad-and-vijayawada
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

Gold Rate Today : పండగ వేళ దేశంలో బంగారం ధర భారీగా తగ్గింది. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ.1200 తగ్గి.. ప్రస్తుతం రూ.60,250గా ఉంది. కిలో వెండి ధర రూ.450 తగ్గి.. ప్రస్తుతం రూ.70,000 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.60,250 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర 70,000 రూపాయలుగా ఉంది.

Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.60,250గా ఉంది. కిలో వెండి ధర రూ.70,000 వద్ద కొనసాగుతోంది.

Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,250 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.70,000గా ఉంది.

Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.60,250గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,000 వద్ద ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,939 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 22.38 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64 ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర .96.72 రూపాయలుగా ఉంటే.. డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ ధర రూ.23,31,294 పలుకుతోంది. ఇథీరియం, బైనాన్స్​ కాయిన్​, క్రిప్టోకరెన్సీలతో పాటుగా మిగతా వాటి ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.23,31,294
ఇథీరియంరూ.1,49,050
టెథర్​రూ.82.81
బైనాన్స్​ కాయిన్​రూ.27,859
యూఎస్​డీ కాయిన్రూ.82.56

లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్​ మార్కెట్లు..
అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య.. బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 344 పాయింట్లు లాభపడి 58,418 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 99 పాయింట్లు లాభంతో.. 17,207 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, లార్సెన్ & టౌబ్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా మోటార్స్, ఇండస్​ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్ గ్రిడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.