ETV Bharat / business

Gold Rate today : స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Jun 28, 2023, 11:33 AM IST

spot gold rate today
Gold Rate today

Gold Rate today : అంతర్జాతీయంగా పసిడి ధరల్లో ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. ఫలితంగా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లోని పసిడి, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయో చూద్దాం.

Gold Rate today : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల​ బంగారం మంగళవారంతో పోల్చితే రూ.340 తగ్గి బుధవారం రూ.60,115గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.35 తగ్గి రూ.71,640కు చేరింది.

  • Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,115గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.71,640గా ఉన్నది.
  • Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,115గా ఉంది. కిలో వెండి ధర రూ.71,640కు చేరింది
  • Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,115గా ఉంది. కిలో వెండి ధర రూ.71,640గా ఉంది
  • Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,115గా ఉంది. కిలో వెండి ధర రూ.71,640గా ఉన్నది.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price: అంతర్జాతీయంగా పసిడి ధరల్లో ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. మంగళవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1925 డాలర్లుగా ఉండగా, బుధవారం నాటికి సుమారు 9 డాలర్లు కోల్పోయి 1916 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. ఔన్స్​ వెండి ధర 22.94 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : బిట్​కాయిన్ విలువ రోజురోజుకూ మరింతగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.24,94,954 వద్ద ట్రేడవుతోంది. కానీ ఇథీరియం, బైనాన్స్ కాయిన్, టెథర్​ మొదలైన క్రిప్టో కరెన్సీ విలువలు మాత్రం కాస్త తగ్గుతున్నాయి. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.24,92,954
ఇథీరియం రూ.1,52,844
టెథర్​ రూ.82
బైనాన్స్ కాయిన్ రూ.19,282
యూఎస్​డీ కాయిన్రూ.83

స్టాక్​మార్కెట్​ న్యూస్​
Stock market today : బుధవారం దేశీయ మార్కెట్లు రికార్డ్​ లాభాలతో ప్రారంభమయ్యాయి. యూస్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతుండడం సహా, విదేశీ పెట్టుబడులు పెరిగిన నేపథ్యమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 312 పాయింట్లు లాభపడి 63,737 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 108 పాయింట్లు వృద్ధి చెంది 18,926 పాయింట్లు వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : టాటా మోటార్స్, టైటాన్, ఎస్​బీఐ, రిలయన్స్​, ఇన్ఫోసిస్​, ఐటీసీ
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు : కోటక్​ బ్యాంకు, టెక్​ మహీంద్రా, యాక్సిక్​ బ్యాంకు, విప్రో

రూపాయి విలువ
Rupee open : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ స్వల్పంగా పెరిగింది. రూపాయి మారకపు విలువ డాలర్​తో పోల్చితే 5 పైసలు పెరిగి రూ.81.97 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol and Diesel Prices : తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.65గా ఉంది. డీజిల్​ ధర రూ.97.80గా ఉంది. వైజాగ్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.66గా ఉంది. జులై 1 నుంచి వీటి ధరల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.