ETV Bharat / business

పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా...

author img

By

Published : Jun 27, 2022, 2:54 PM IST

Updated : Jun 27, 2022, 3:36 PM IST

gold-rate-today-
gold-rate-today-

Gold Price Today: బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ.52,710గా ఉంది. కిలో వెండి ధర రూ.62,580గా ఉంది.

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. సోమవారం బంగారం ధర రూ.260 పెరిగింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.52,710 వద్ద ఉంది. వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండి రూ.1000 ఎగబాకి.. రూ.62,580 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,710గా ఉంది. కిలో వెండి ధర రూ.62,580 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,710గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,580గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,710గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,580 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,710గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,580వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర కూడా పెరిగింది. ప్రస్తుతం 1839 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.52 డాలర్లుగా ఉంది. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.78 వద్ద ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో బిట్ కాయిన్ విలువ పెరిగింది. ప్రస్తుతం రూ.17,78,592 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.17,78,592
ఇథీరియంరూ.1,02,048
టెథర్రూ.83
బినాన్స్​ కాయిన్రూ.19,936
యూఎస్​డీ కాయిన్రూ.83.50

Stocks Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్ఛేంజీ- సెన్సెన్స్​ 456 పాయింట్లు వృద్ధి చెంది 53 వేల 184 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్ఛేంజీ- నిఫ్టీ 132 పాయింట్లు మెరుగుపడి 15 వేల 832 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు, ఆసియా, ఐరోపా మార్కెట్లు లాభాల్లో ఉండటం దేశీయ మార్కెట్లను ప్రభావితం చేసింది.

ఎల్​అండ్​టీ, హెచ్​సీఎల్​ టెక్ షేర్లు​ రెండున్నర శాతానికి పైగా లాభాపడ్డాయి. టెక్​ మహీంద్రా, ఇన్ఫీ, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఏషియన్​ పెయింట్, భారతీ ఎయిర్​టెల్​, టాటాస్టీల్​ షేర్లు కూడా వృద్ధి చెందాయి. టైటాన్​, రిలయన్స్​, కొటాక్​ బ్యాంక్​ అతిస్వల్పంగా నష్టపోయాయి.

ఇవీ చదవండి: స్టాక్​ మార్కెట్లోకి తొలి అడుగు.. 'సూచీ ఫండ్ల'తో మేలు!

ఆన్​లైన్​ గేమింగ్​, గుర్రపు పందేలపై 28 శాతం జీఎస్టీ!

Last Updated :Jun 27, 2022, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.