ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Jun 3, 2022, 10:55 AM IST

gold-price-today-stock-market Live Updates
gold-price-today-stock-market Live Updates

Gold Price Today: బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ. 53 వేల మార్కు దాటింది. కిలో వెండి ధర రూ. 64 వేల 300పైకి చేరింది. దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు వరుసగా రెండో సెషన్​లో లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర గురువారంతో పోలిస్తే రూ. 500కుపైగా పెరిగింది. ప్రస్తుతం రూ.53,030 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ. 1300పైగా పెరిగింది. ప్రస్తుతం 64 వేల 380కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,030గా ఉంది. కిలో వెండి ధర రూ.64,380 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,030 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,380గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,030గా ఉంది. కేజీ వెండి ధర రూ. 64,380 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,030గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,380వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర కూడా పెరిగింది. ఔన్సు బంగారం 1868 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 22.36 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో.. బిట్​కాయిన్​ విలువ పెరిగింది. ప్రస్తుతం రూ. 24,95,196 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.24,95,196
ఇథీరియంరూ.1,49,231
టెథర్రూ.82.11
బినాన్స్​ కాయిన్రూ.25,195
యూఎస్​డీ కాయిన్రూ.82.16

Stock Market Live Updates: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు వరుసగా రెండో సెషన్​లో లాభాల్లో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 540 పాయింట్లకుపైగా పెరిగి.. 56 వేల 350 ఎగువవ ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో 16 వేల 760 ఎగువన కొనసాగుతోంది. ఐటీ షేర్లు రాణిస్తుండటం మార్కెట్ల లాభాలకు ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. విప్రో, హెచ్​సీఎల్​ టెక్​, ఇన్ఫోసిస్​, టెక్​ మహీంద్రా, రిలయన్స్​ జోరుమీదున్నాయి. శ్రీసిమెంట్స్​, అపోలో హాస్పిటల్స్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, బ్రిటానియా ఇండస్ట్రీస్​, గ్రేసిమ్​ నష్టపోయాయి.

ఇదీ చదవండి: 40+ ఏజ్​లోనే రిటైర్ కావాలా? అయితే 'ఫైర్​' అవ్వాల్సిందే!

జూన్​లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.