ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఇలా?

author img

By

Published : Jun 2, 2022, 10:19 AM IST

gold-price-today-stock-market Live Updates
gold-price-today-stock-market Live Updates

Gold Price Today: బంగారం, వెండి ధరలు గురువారం మళ్లీ భారీగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ. 52,520గా ఉంది. కిలో వెండి ధర రూ. 63,110 దాటింది. వరుసగా రెండు సెషన్లు నష్టాలు నమోదుచేసిన దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు.. గురువారం ఫ్లాట్​గా ట్రేడవుతున్నాయి.

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు గురువారం భారీగా పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.200 వరకు పెరిగి రూ.52,520కు చేరింది. కిలో వెండి ధర రూ. 800 మేర పెరిగి 63,115గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ. 52,520గా ఉంది. కిలో వెండి ధర రూ.63,115 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,520 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,115గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,520గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,115 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,520గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,115 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర కూడా పెరిగింది. ఔన్సు బంగారం 1846 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.81 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో.. బిట్​కాయిన్​ విలువ మళ్లీ భారీగా పతనమైంది. ప్రస్తుతం రూ. 24,64,118 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.24,64,118
ఇథీరియంరూ.1,51,168
టెథర్రూ.82.88
బినాన్స్​ కాయిన్రూ.24,987
యూఎస్​డీ కాయిన్రూ.82.96

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: వరుసగా రెండు సెషన్లు నష్టాలు నమోదుచేసిన దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు గురువారం ఫ్లాట్​గా ట్రేడవుతున్నాయి. ఉదయం 10 గంటల సమయంలో.. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 80 పాయింట్లకుపైగా పెరిగి.. 55 వేల 460 వద్ద ఉంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 16 వేల 525 వద్ద కొనసాగుతోంది. రిలయన్స్​, టీసీఎస్​, కోల్​ ఇండియా, బజాజ్​ ఫిన్​సర్వ్​, యాక్సిస్​ బ్యాంక్​ రాణిస్తున్నాయి. అపోలో హాస్పిటల్స్​, హీరో మోటోకార్ప్​, హెచ్​డీఎఫ్​సీ లైఫ్​, ఎస్​బీఐ లైఫ్​ ఇన్సూరెన్స్​, హెచ్​యూఎల్​ డీలాపడ్డాయి.

ఇదీ చదవండి: 40+ ఏజ్​లోనే రిటైర్ కావాలా? అయితే 'ఫైర్​' అవ్వాల్సిందే!

జూన్​లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.