ETV Bharat / business

మళ్లీ పెరిగిన బంగారం ధర- నేటి లెక్క ఇలా...

author img

By

Published : May 17, 2022, 10:53 AM IST

Gold Rate Today: బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

gold rate today
బంగారం ధర

Gold price today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.362 పెరిగింది. మరోవైపు వెండి ధర కూడా భారీగా వృద్ధి చెందింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,310 పెరిగి రూ.61,865 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.52,220 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,220 గా ఉంది. కిలో వెండి ధర రూ.61,865 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,220 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61,865 గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,220గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,865 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,220గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,865 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగానూ స్పాట్​ గోల్డ్​ ధర స్వల్పంగా తగ్గింది. ఔన్సు బంగారం 1,824 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.60 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ.105.45, లీటర్​ రూ. 96.71గా ఉంది. ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.50, లీటర్​ డీజిల్​ రూ.104.75. వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ.105.63 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.

Cryptocurrency Price in India: క్రిప్టో కరెన్సీల్లో బిట్​కాయిన్​, ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ సహా ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.24,65,369
ఇథీరియంరూ.1,68,767
టెథర్రూ.81.28
బినాన్స్​ కాయిన్రూ.24,881
యూఎస్​డీ కాయిన్రూ.81.40

మంగళవారం సెషన్​లో స్టాక్​మార్కెట్లు లాభాలబాట పట్టాయి. వరుస నష్టాలతో కుదేలైన దేశీయ స్టాక్​ మార్కెట్లు.. ఈ రోజును లాభాలతో ప్రారంభించాయి. మెటల్​ రంగంలో సూచీలు నాలుగు శాతం పెరగడం, ఎల్​ఐసీ లిస్టింగ్​లో 9 శాతం డిస్కౌంట్​ ప్రకటించడం మార్కెట్​పై ప్రభావం చూపాయి. పవర్​, రియల్​ఎస్టేట్​, ఫార్మా రంగాల్లో షేర్ల విక్రయాలు నమోదయ్యాయి. సెన్సెక్స్​ 724 పాయింట్ల వృద్ధితో 53,698కు చేరగా.. నిఫ్టీ 223 పాయింట్ల లాభంతో 16,065 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. టాటా స్టీల్​, కోల్​ ఇండియా, జేఎస్​డబ్ల్యూ స్టీల్​ లాభాలను నమోదు చేశాయి.

ఇదీ చూడండి : LIC IPO: నేడే ఎల్‌ఐసీ ఐపీఓ లిస్టింగ్‌.. లాభాలా? నష్టాలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.