ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఇలా..

author img

By

Published : Jul 18, 2022, 10:55 AM IST

gold price today
బంగారం ధర

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.240 పెరిగి.. ప్రస్తుతం రూ.52,220 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.400 పెరిగి.. రూ.57,270 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,220గా ఉంది. కిలో వెండి ధర రూ.57,270 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,220 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.57,270గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,220గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,270 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,220గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,270 వద్ద కొనసాగుతోంది.
స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..: అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,714 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 18.85 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ: బిట్​కాయిన్ విలువ స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.17,37,890 పలుకుతోంది. ఇతర క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.17,37,890
ఇథీరియం రూ.1,14,998
టెథర్ రూ.82.28
బినాన్స్​ కాయిన్ రూ.20,997
యూఎస్​డీ కాయిన్ రూ.82.95

Stock Market Live Updates: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ముంబయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​.. 420 పాయింట్ల లాభంతో.. 54,180 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 127 పాయింట్లు ఎగబాకి.. 16,175 వద్ద కొనసాగుతోంది. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్​, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభాల్లో పయనిస్తున్నాయి. రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్ నష్టాల్లో ఉన్నాయి.

ఇవీ చదవండి: 'రూ.4 లక్షల కోట్ల వ్యవసాయ ఎగుమతులు.. పెరిగిన రైతుల ఆదాయం!'

సామాన్యుడిపై భారం.. జీఎస్​టీ రేట్లు పెంపు.. అప్పడాలు, పెరుగు, షార్ప్​నర్​పైనా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.