ETV Bharat / business

పెరిగిన బంగారం ధర.. రూ.70వేలు దాటిన కేజీ వెండి.. ఏపీ, తెలంగాణలో ఇలా..

author img

By

Published : Dec 14, 2022, 12:13 PM IST

gold rate today
gold

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం రూ.580 మేర పెరిగి ప్రస్తుతం రూ.56,150 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర వెయ్యి రూపాయిలు ఎగబాకింది. ప్రస్తుతం కేజీ వెండి రూ.70,130 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.56,150గా ఉంది. కిలో వెండి ధర రూ.70,130 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.56,150 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.70,130గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.56,150గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,130వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.56,150 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.70,130గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,811.80 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.81 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.14,67,855 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.14,67,855
ఇథీరియంరూ.1,08,972
టెథర్​రూ.82.62
బైనాన్స్​ కాయిన్​రూ.22,661
యూఎస్​డీ కాయిన్రూ.82.63

స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు సూచీలకు అండగా నిలుస్తున్నాయి. ఉదయం 9:23 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్‌ 240 పాయింట్ల లాభంతో 62,774 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 66 పాయింట్లు లాభపడి 18,674 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో విప్రో, పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌, ఐటీసీ నష్టపోతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి.
రూపాయి విలువ:
డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు తగ్గి ప్రస్తుతం రూ. 82.64 వద్ద ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.