ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Dec 13, 2022, 10:53 AM IST

gold
gold

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర పెరిగింది. పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ. 40 తగ్గి రూ. 55,570 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి రూ.330 పెరిగి ప్రస్తుతం రూ.69,130 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.55,570గా ఉంది. కిలో వెండి ధర రూ.69,130 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.55,570వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.69,130గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.55,570గా ఉంది. కేజీ వెండి ధర రూ.69,130వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.55,570 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.69,130గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,782.65 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.40 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.14,17,655 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.14,17,655
ఇథీరియంరూ.1,04,891
టెథర్​రూ.82.68
బైనాన్స్​ కాయిన్​రూ.22,178
యూఎస్​డీ కాయిన్రూ.82.71

స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు వీస్తున్నాయి. దేశీయంగా నవంబరు నెలలో ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్ఠానికి దిగొచ్చింది. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 121 పాయింట్ల లాభంతో 62,252 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 18,528 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ నష్టపోతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి.
రూపాయి విలువ:
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 20 పైసలు తగ్గి ప్రస్తుతం రూ.82.71 వద్ద ట్రేడవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.